పరిపూర్ణ ప్రకృతి సోయగాల మధ్య సాగే ప్రయాణం కోసం ఎదురుచూసిన వారికి శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం వరకు కృష్ణా నదిపై లాంచీ సేవలు ఈ నెల 15వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రఫీ అభిమానులకు విశేష అనుభూతిని ఇస్తుంది.
ఇటీవల కాలంలో వరదల కారణంగా ఈ ప్రయాణాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. నీటి మట్టం పెరగడం, భద్రతా పరమైన కారణాల వల్ల లాంచీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడంతో అధికారుల అనుమతి మేరకు ఈ సేవలు మళ్లీ ప్రారంభించబోతున్నారు.
ఈ లాంచీ ప్రయాణం ద్వారా పర్యాటకులు నదీ తీరంలోని అడవుల సౌందర్యాన్ని, కొండల మధ్యుగా సాగే నీటి ప్రవాహాన్ని సమీపంగా చూడగలుగుతారు. ప్రకృతితో మమేకం కావాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక మంచి అవకాశం. లాంచీల్లో భద్రతా చర్యలు, గైడ్ల సహాయం, అవసరమైన ఏర్పాట్లు పర్యాటక శాఖచే చేపట్టబడ్డాయి.
తెలుగు రాష్ట్రాల పర్యాటక అభివృద్ధిలో ఇది మరొక ముందడుగు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇది దోహదపడే అవకాశం కల్పిస్తుంది. అలాగే పర్యాటకులకు కేవలం దర్శనం మాత్రమే కాకుండా ఒక ప్రత్యేక అనుభూతిని అందించనుంది. కుటుంబంతో గానీ, స్నేహితులతో గానీ ఈ లాంచీ ప్రయాణం జరుపుకోవడం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa