వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఈ క్రికెటర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీలో ఆట ఆడబోతున్నాడు.ఈసారి సుందర్, కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్లో హాంప్షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆయన ఆడనున్న రెండు మ్యాచ్లు — సెప్టెంబర్ 15న సోమర్సెట్తో, సెప్టెంబర్ 24న సర్రేతో జరగనున్నవిగా తెలుస్తోంది.హాంప్షైర్ క్రికెట్ క్లబ్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా సుందర్ జట్టులో చేరుతున్న విషయాన్ని ధృవీకరించింది. "భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మా చివరి రెండు మ్యాచ్ల కోసం మాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెలకమ్ వాషీ!" అంటూ ఓ పోస్టు షేర్ చేసింది.ఇంగ్లండ్ కౌంటీల్లో సుందర్కు ఇది రెండో అనుభవం. గతంలో లాంకషైర్ తరఫున కౌంటీ క్రికెట్లో పాల్గొన్న ఆయన, అప్పుడు కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఈసారి కౌంటీ మ్యాచ్లు — విండీస్తో టెస్టు సిరీస్కు ముందు ప్రాక్టీస్గా ఉపయోగపడే అవకాశముంది.తాజాగా ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సుందర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆ సిరీస్లో ఆయన 7 వికెట్లు తీసే పాటు, 284 పరుగులు చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్ ఎ-టీమ్తో జరిగిన మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.అయితే స్వదేశంలో జరిగిన ఆసీస్-ఎతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్కు వాషీ ఎంపిక కావాలని భావించినా, సెలక్టర్లు అతనికి అవకాశం ఇవ్వలేదు. ఆ స్థానంలో మానవ్ సుతార్, తనుష్ కోటియన్, హర్ష్ దుబే వంటి యువ స్పిన్ ఆల్రౌండర్లకు ఛాన్స్ ఇచ్చారు.ఇప్పటికే బలమైన ఫార్మ్లో ఉన్న వాషింగ్టన్ సుందర్, ఇంగ్లండ్ టూర్ ముగిసిన వెంటనే విండీస్తో జరిగే టెస్టు సిరీస్ కోసం జట్టులో చేరనున్నారు. భారత్-వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa