ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ని ప్రశ్నించిన వ్యక్తిపై దాడికి పాల్పడిన జనసేన నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 01:01 PM

సుగాలి ప్రీతి ఉదంతం.. 33వేల మందికి పైగా మహిళలు అదృశ్యం తదితర అంశాలపై గతంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఒకరు ఓ మీడియా ఛానెల్‌లో విమర్శించినందుకు జనసేన మూకలు అతనిపై దాడి చేయడమేకాక అతని దుకాణాన్ని ధ్వంసం చేసిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. పైగా అతనిని మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా క్షమా­పణలు చెప్పించి, అతనిపైనే ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే.... బందరు మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి వైయ‌స్ఆర్‌సీపీలో క్రీయాశీల కార్యకర్త. ఇటీవల ఆయన ఓ మీడియా చానెల్‌లో మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి ఘటన జరిగింది ఎప్పుడు.. ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో పవన్‌కళ్యాణ్‌ తెలుసుకోవాలంటూ విమర్శలు చేశారు. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని.. కానీ, బాధిత కుటుంబానికి న్యాయం చేసింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, మహిళల అదృ­శ్యంపై డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేశారని పవన్‌ విధానాలను ప్రశ్నించారు.ఈ వీడియో వైరల్‌ అవడంతో జనసేన నాయకుడు కొరియర్‌ శ్రీనుతోపాటు దాదాపు యాభై మందికి పైగా గురువారం రాత్రి 10.30 ప్రాంతంలో గిరి ఇంటిపై మూకుమ్మడిగా దాడిచేశారు. ఇంట్లోని వస్తువులతో పాటు అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు. అతనిపైనా విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. అంతేగాక.. గిరిని మోకాలిపై కూర్చోబెట్టి జనసేన నాయకులకు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. అలాగే, దెబ్బలు తిన్న గిరిపైనే బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసు నమోదుచేశారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa