కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా జీఎస్టీ సవరణ నిర్ణయం ద్విచక్ర వాహనాల పరిశ్రమపై తక్షణ ప్రభావాన్ని చూపుతోంది. 350 సీసీ లోపు బైక్లు, స్కూటర్లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.హోండా తెలిపిన వివరాల ప్రకారం.. వినియోగదారులు ఎంపిక చేసుకునే మోడల్ను బట్టి గరిష్ఠంగా రూ.18,887 వరకు ధరల తగ్గింపు లభించనుంది. ధర తగ్గింపు పొందుతున్న మోడల్స్లో ప్రధానంగా ఇవి ఉన్నాయి...... యాక్టీవా (Activa), డియో (Dio), షైన్ (Shine), యూనికార్న్ (Unicorn), సీబీ350 సిరీస్ (CB350 Series). ఈ ధరల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa