భారతీయ చిన్నారులకు అవసరం లేకపోయినా వైద్యులు యాంటీబయాటిక్స్ మందులు రాస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చిన్న చిన్న అనారోగ్యాలకూ యాంటీబయాటిక్స్ మందులు వాడేలా చేస్తున్నారని తేలింది. దీనికి ప్రధాన కారణం వైద్యులపై తల్లిదండ్రుల ఒత్తిడేనని శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. చిన్న అనారోగ్యంతో బాధపడుతున్నా సరే తమ పిల్లలకు వెంటనే నయం కావాలని తల్లిదండ్రులు వైద్యులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని వారు పేర్కొన్నారు.దీంతో పిల్లల అనారోగ్యానికి బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ కారణం కానప్పటికీ వైద్యులు వారికి యాంటీబయాటిక్స్ మందులు రాస్తున్నారని చెప్పారు. దీనివల్ల పిల్లలకు యాంటీబయాటిక్స్ ఓవర్ డోస్ అవుతుందని, భవిష్యత్తులో వారికి మందులకు నిరోధకత (యాంటీమైక్రోబియాల్ రెసిస్టెన్స్–ఏఎంఆర్) ఏర్పడుతుందని వివరించారు. ఈ నిరోధకత పెరగడం వల్ల అనారోగ్యాలకు చికిత్స చేయడం మరింత కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa