వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైందని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమిద్దామని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైయస్ జగన్ గొప్ప సంకల్పంతో ముందుకెళ్ళారు, కేవలం ప్రేవేట్ వారికి కట్టబెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ ఒప్పందాలకు సిద్దమయ్యారు. పైకి పీపీపీల వల్ల నష్టం లేదంటున్నారు కానీ గట్టిగా వైయస్ జగన్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు పైకి దబాయింపులు, హడావిడి చేస్తూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అసలు రూపం బయటపడాలి, ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వల్ల ప్రజలు ఎలా నష్టపోతారో చెప్పగలగాలి, మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ రాకపోతే ఆయా ప్రాంతాల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో తెలియజేయాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మధ్య చర్చ జరగాలి అని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa