అసోంలో నిన్న సాయంత్రం 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఈ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి నవజాత శిశువుల ప్రాణాలను కాపాడిన ఇద్దరు నర్సుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారి ధైర్యానికి, మానవత్వానికి విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి.నాగావ్ నగరంలోని ఆదిత్య నర్సింగ్ హోమ్లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో రికార్డయిన ఈ వీడియో భూకంపం వచ్చిన సమయంలో అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టింది. సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో భూమి కంపించడం మొదలుకాగానే ఆ ఇద్దరు నర్సులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా శిశువుల వద్దకు పరుగెత్తారు.వార్డులోని వస్తువులు, అద్దం, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలు తీవ్రంగా ఊగిపోతున్నప్పటికీ, వారు తమ ప్రాణాలను లెక్కచేయకుండా శిశువులను పట్టుకున్నారు. ఒక నర్సు ఇద్దరు శిశువులను కాపాడగా, మరో నర్సు ఒక శిశువుకు తన చేతులతో కవచంలా అడ్డుగా నిలబడింది. భూకంపం ఆగే వరకు కూడా వారు ధైర్యం కోల్పోకుండా, శిశువులను తమ చేతుల్లోనే సురక్షితంగా ఉంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa