ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసాపురం ప్రజలకి శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 04:07 PM

పశ్చిమ గోదావరి జిల్లా, ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. ప్రతిష్ఠాత్మకమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మైసూరుకు ఒక ప్రత్యేక రైలును కూడా నరసాపురం నుంచి నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.అలానే నరసాపురం పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై నుంచి నరసాపురం వరకు ఈ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేసి, రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటిస్తుందని ఆయన వివరించారు. తన విజ్ఞప్తికి సహకరించిన రైల్వే మంత్రికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa