ఎన్డీఏ కూటమిపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. “సంపద సృష్టించి, ఆదాయం పెంచి, ఆ ఫలాలను సంక్షేమం ద్వారా ప్రజలకు పంచుతామని చెప్పాం. ఆ మాటను ప్రజలు విశ్వసించే మాకు 94 శాతం స్ట్రైక్ రేట్తో అఖండ విజయాన్ని అందించారు. చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ను విజయవంతంగా అమలు చేస్తున్నాం” అని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైన పెన్షన్ల పథకం ద్వారా 64 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని, ‘తల్లికి వందనం’తో ప్రతి విద్యార్థికీ ఆర్థిక చేయూత అందిస్తున్నామని వివరించారు. ‘స్త్రీశక్తి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని విమర్శించిన వారికి దాని విజయమే సమాధానం చెప్పిందన్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 90 శాతానికి పెరిగిందని, ఇందుకు కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. దీపం-2 ద్వారా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు, అన్నదాత సుఖీభవ కింద తొలి విడతగా రూ.7 వేలు అందించామని, అక్టోబర్ 1న ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు అందజేస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa