ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఎస్ఈ విద్యార్ధులకి 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 07:46 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలోని విద్యార్థులకు బోర్డు కీలకమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై వార్షిక పరీక్షలకు హాజరు కావాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తీసుకున్న తాజా నిర్ణయాన్ని అధికారులు వెల్లడించారు.ఇటీవల సీబీఎస్ఈ ఫలితాల వెల్లడికి 'ఇంటర్నేషనల్ అసైన్‌మెంట్'ను తప్పనిసరి చేసింది. అయితే, తరగతులకు సరిగా హాజరుకాని విద్యార్థులు ఈ అసైన్‌మెంట్లను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో, విద్యార్థులు అసైన్‌మెంట్లను సమర్థంగా పూర్తి చేయాలంటే వారికి తగినంత హాజరు శాతం ఉండటం అవసరమని భావించింది. అందుకే, ప్రతి విద్యార్థికి 75 శాతం అటెండెన్స్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సీబీఎస్ఈ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa