ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ దేశభక్తి , హిందుత్వ వాదనల్లో అంతా మోసమే

national |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 08:28 PM

దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ వ్యవహారంపై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే-యూబీటీ) వర్గం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ ఒక్క మ్యాచ్‌తో బీజేపీ దేశభక్తి, హిందుత్వ వాదనల్లోని ద్వంద్వ వైఖరి, కపటత్వం బట్టబయలయ్యాయని మండిపడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఉన్నందునే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అనుమతించారని శివసేన (యూబీటీ) ఆరోపించింది. జై షా దేశభక్తి కోసం కాకుండా, డబ్బు సంపాదించడమే వ్యాపారంగా పెట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఉగ్రవాదులకు బహిరంగంగా ఆర్థిక చేయూతనిస్తోందని, దీనిని ప్రతి భారతీయుడు ఖండించాలని పేర్కొంది.దుబాయ్‌లో జరిగిన మ్యాచ్ వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కనీసం రూ. 1,000 కోట్లు అందాయని, బెట్టింగ్ ద్వారా మరో రూ. 50,000 కోట్లు పాకిస్థాన్‌లోని జూదరులకు చేరాయని ‘సామ్నా’ ఆరోపించింది. ఈ చర్య ద్వారా భారత్‌లో ఉగ్రవాదాన్ని సృష్టించే శక్తుల చేతులను కేంద్ర ప్రభుత్వమే బలోపేతం చేసిందని విమర్శించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa