మద్యం మత్తులో వీడియో పోస్ట్ చేసిన టీనేజర్లకు కోర్టు జరిమానా చైనాలోని ఓ హాట్పాట్ రెస్టారెంట్లో అసభ్యకరమైన చేష్టతో చట్టాన్ని ఉల్లంఘించిన ఇద్దరు టీనేజర్లపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది.షాంఘైలోని హైడిలావ్ అనే ప్రముఖ హాట్పాట్ రెస్టారెంట్ బ్రాంచ్లో, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల యువకులు సూప్ పాత్రలో మూత్ర విసర్జన చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు.ఈ సంఘటన ఫిబ్రవరి 2025లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.ఈ ఘటన వల్ల తమ బ్రాంచ్కు తీవ్ర నష్టం వాటిల్లిందని, లక్షలాది మంది ఖాతాదారులకు పరిహారం చెల్లించాల్సి వచ్చిందని హైడిలావ్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. సంస్థ మొత్తం రూ. 2.84 కోట్ల వరకు నష్టపోయిందని తెలిపింది.గత శుక్రవారం ఈ కేసులో తీర్పు వెలువరించిన షాంఘై కోర్టు, ఇద్దరు టీనేజర్లు మరియు వారి తల్లిదండ్రులు ఈ పరిణామానికి బాధ్యత వహించాలని పేర్కొంది.
*కోర్టు ఆదేశాల ప్రకారం:రెస్టారెంట్ ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు రూ. 2.4 కోట్లు చెల్లించాలి టేబుల్వేర్ కలుషితమవడంతో వాటిని మార్చడానికి మరియు శుభ్రపరచడానికి రూ. 16 లక్షల వరకు చెల్లించాలి కోర్టు ఖర్చుల కోసం రూ. 8.5 లక్షలు చెల్లించాలి.అయితే, హైడిలావ్ తమ ఖాతాదారులకు అదనంగా చెల్లించిన పరిహారాన్ని కోర్టు వ్యాపార సంబంధిత స్వచ్ఛంద నిర్ణయంగా పరిగణించింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు, ఈ బ్రాంచ్ను సందర్శించిన 4,000 మందికిపైగా కస్టమర్లకు పూర్తి రీఫండ్తో పాటు వారి బిల్లుకు పది రెట్లు ఎక్కువగా నగదు పరిహారంగా ఇచ్చింది.ఈ ఘటన నేపథ్యంలో హైడిలావ్ సంస్థ ఆ బ్రాంచ్లో మొత్తం హాట్పాట్ పరికరాలను మార్చింది, శుద్ధి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వెయ్యికిపైగా బ్రాంచ్లను నిర్వహిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa