ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్వెస్టర్లకు కాసుల పంట,,,ఒక్కరోజే 20 శాతం దూసుకెళ్లిన స్టాక్

business |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 10:16 PM

 భారత్- అమెరికా మధ్య కొంత కాలంగా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో.. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాల్ని ప్రకటించారు. తొలుత 25 శాతం ప్రకటించగా.. దానిని మళ్లీ రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చారు. ఆగస్ట్ 27 నే ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు భారత్- అమెరికా మధ్య ప్రతిష్టంభన కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపించింది. ఇంకా ఇదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు దాదాపు ఖరారైంది. ఈసారి 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు.


ఈ క్రమంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఇంకా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా పుంజుకోవడం స్టాక్ మార్కెట్లలో లాభాలకు ఒక కారణంగా నిలిచింది. దీంతో సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 82,381 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 170 పాయింట్లు పెరగడంతో 25,239 వద్ద సెషన్ ముగించింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ మినహా అన్ని స్టాక్స్ లాభాల్ని నమోదు చేశాయి. ఇక్కడ ప్రధానంగా కోటక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, ఎం అండ్ ఎం, ఎయిర్‌టెల్ ఇవన్నీ లాభపడ్డాయి.


>> ఈ క్రమంలోనే ఒక స్టాక్ భారీగా పెరిగింది. ఇదే పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్. కిందటి సెషన్‌లో రూ. 34.05 వద్ద స్థిరపడగా.. మంగళవారం రోజు చూస్తే 18.65 శాతం పెరిగి రూ. 40.40 వద్ద సెషన్ ముగించింది. ఇంట్రాడేలో ఏకంగా 20 శాతం పెరిగి రూ. 40.85 శాతం వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 75.95 కాగా.. కనిష్ట ధర రూ. 29.33 గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 559.22 కోట్లుగా ఉంది.


గత 5 రోజుల్లో చూస్తే ఈ స్టాక్ ధర 15 శాతం పెరిగింది. నెల రోజుల్లో మాత్రం 3 శాతం పడిపోయింది. 6 నెలల్లో చూస్తే 17 శాతం వరకు ఎగబాకింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 16 శాతం పతనమైంది. ఏడాదిలో కూడా ఈ స్టాక్ నష్టపోయింది. గత ఐదేళ్లలో చూస్తే దాదాపు 390 శాతం పెరిగిందీ షేర్ ధర. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది దేశంలోనే అతిపెద్ద ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్‌లలో ఒకటిగా ఉంది. అలీగఢ్ (యూపీ), ఔరంగాబాద్ (మహారాష్ట్ర), పంత్‌నగర్ (ఉత్తరాఖండ్),హోసూర్ (తమిళనాడు) ఇలా ఇక్కడ మొత్తం 9 ఫెసిలిటీస్ ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa