డార్క్ ప్యాటర్న్లను (మోసపూరిత వ్యాపార పద్ధతులు) వాడుతున్న ఇ-కామర్స్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రతికూల సమీక్షలను దాచిపెట్టడం వంటి అన్యాయ వ్యాపార ప్రవర్తనలను వెంటనే ఆపాలని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఈ సంస్థలకు హెచ్చరించారు.సంస్థలు స్వయంగా తమ పద్ధతులను సమీక్షించి, డార్క్ ప్యాటర్న్లను వాడకూడదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు మరియు నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు."ఏఐను దుర్వినియోగం చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం సాధ్యం. తప్పుదారి పట్టించే సమాచారం సృష్టించడం కూడా జరగొచ్చు. ఇ-కామర్స్ సంస్థలు ప్రతికూల రివ్యూలను దాచిపెట్టడం వంటి డార్క్ ప్యాటర్న్లను వాడుతున్నాయి. వీటిపై నిరోధం కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది," అని నిధి ఖరే పేర్కొన్నారు.ఫేక్ అత్యవసర హెచ్చరికలు చూపించడం, ప్రతికూల సమీక్షలను దాచిపెట్టడం, సబ్స్క్రిప్షన్ ట్రాప్స్, తప్పు ధరల ఆఫర్ల వాడకం వంటి డార్క్ ప్యాటర్న్లు సంస్థలు వాడకూడదని సూచించారు. ఎవరైనా ఇలాంటి వ్యూహాలను ఉపయోగిస్తే, అది అన్యాయ వ్యాపార పద్ధతిగా పరిగణించి చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa