వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరో బిగ్ షాక్ తగిలింది. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం అమరావతిలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు. ఆయనతోపాటు పాటు పలువురు వైసీపీ నేతలు సైతం టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే వైసీపీతోపాటు ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమిలోని పార్టీలకు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వడమే కాకుండా.. పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీకి పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు. అంతేకాదు.. కీలక పదవులకు సైతం వారు రాజీనామా చేశారు. ఆ జాబితాలో తాజాగా మర్రి రాజశేఖర్ సైతం చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa