ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విచారణకి హాజరుకానున్న ఎంపీ మిథున్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 01:49 PM

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం ఉదయం విజయవాడకు సిట్ అధికారులు తరలించారు. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో.. రెండు రోజుల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారించనున్నారు. లిక్కర్ స్కాంలో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని శుక్రవారం ఉదయం విజయవాడకు తీసుకు వెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఎంపీ మిథున్ రెడ్డిని విచారించేందుకు ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa