ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ విద్యార్థుల,,. దసరా సెలవులు మారాయి, మొత్తం 12 రోజులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 09:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ తీపికబురు చెప్పారు. దసరా సెలవుల్ని మరో రెండు రోజులు పెంచారు.. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 'పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాము' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


వాస్తవానికి ఏపీ ప్రభుత్వ దసరా సెలవుల్ని ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు (9 రోజులు) మాత్రమే ఇచ్చింది. అయితే పలువురు ఎమ్మెల్సీలు మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశారు. స్కూల్ విద్యార్థులకు ఈ నెల 22 నుంచి సెలవులు ఇవ్వాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు (11 రోజులు) దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నెల 21 ఆదివారం కావడంతో.. ఆ రోజు నుంచే పిల్లల స్కూళ్లకు సెలవులు ప్రారంభమవుతాయి. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు 12 రోజుల పాటూ సెలవులు వచ్చినట్లు లెక్క.


తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవుల్ని ప్రకటించారు. అక్కడ మొత్తం 13 రోజుల పాటూ దసరా సెలవులు ఇచ్చారు. అంటే అక్టోబర్ 4 నుంచి స్కూల్స్ ప్రారంభమవుతాయి. అలాగే అక్టోబర్ 2న దసరా పండుగ వచ్చింది.. అయితే అదే రోజు గాంధీ జయంతి కూడా ఉంది. అంటే ఈసారి గాంధీ జయంతి సెలవు దినం దసరాతో కలిసి రావడంతో పిల్లలు ఒక సెలవును మిస్ అయ్యారని చెప్పాలి. మొత్తం మీద ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు చాలానే ఇచ్చారు.. ఇంకేముంది ఫుల్ ఎంజాయ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa