వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మదనపల్లి మెడికల్ కాలేజీ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. అటువంటిది గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలోనే 5 కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేస్తే.. మాజీ సీఎం జగన కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశ్యంతో ప్రైవేటుకు కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించలేమని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గమని విమర్శించారు.మదనపల్లె మెడికల్ కళాశాలను 95 ఎకరాలలో నిర్మాణ పనులు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. యధావిధిగా నిర్మాణపు పనులు కొనసాగించి ఉంటే ఈ సమయానికి నిర్మాణ పనులుపూర్తయ్యేవన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడి స్తారనే స్పష్టత లేదన్నారు వైద్య విద్య అభ్యసించాలన్న కలపై బాటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే కుట్రలు మాసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే వైయస్ఆర్ సీపీ తరపున పోరాటాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు.అయితే వాస్తవాలను కూటమి ప్రభుత్వం విస్మరించి గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa