ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా పండగ సందర్భంగా తీపికబురు.. తిరుపతికి మరో కొత్త విమాన సర్వీస్ ప్రారంభంకానుంది. వచ్చేనెల ఒకటో తేదీ (అక్టోబర్ 1) నుంచి రాజమహేంద్రవరం- తిరుపతి మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఏపీడీ ఎన్కే శ్రీకాంత్ కోరారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి చొరవతో ఈ తిరుపతి విమాన సర్వీసు అందుబాటులోకి వస్తుంది అన్నారు. ఈ విమాన సర్వీస్ను అలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ నడపనుందని తెలిపారు. ఈ విమాన సర్వీసు మంగళ, గురు, శనివారాలు (వారంలో మూడు రోజులు) సర్వీసు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ విమానం తిరుపతిలో ఉదయం 7.40 గంటలకు బయలుదేరుతుంది.. ఉదయం 9.25కి రాజమహేంద్రవరం చేరుకుంటుంది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో రాజమహేంద్రవరం నుంచి 9.50 గంటలకు బయలుదేరుతుంది.. ఉదయం 11.15కి తిరిగి తిరుపతి చేరుతుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలకి వచ్చిన తర్వాత ఏపీకి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఏపీ నుంచి విదేశాలకు, దేశంలోని పలు నగరాలకు, రాష్ట్రంలోని నగరాలకు కూడా సర్వీసులు వచ్చేశాయి. గతంలో విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లాలంటే నేరుగా విమానం లేక ఇబ్బందులు ఎదురయ్యేవి.. ఇటీవల విశాఖపట్నం నుంచి విజయవాడకు కూడా విమాన సర్వీస్ ప్రారంభమైంది. జులై నెలలో కర్నూలు- విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కర్నూలు- విజయవాడ మధ్య విమాన సర్వీసులు వారానికి మూడు రోజులపాటు ఇండిగో నడుపుతోంది.
మూడు నెలల క్రితం ఏపీ నుంచి మూడు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ-బెంగళూరు, విశాఖ-భువనేశ్వర్, విశాఖపట్నం-అబుదాబి మధ్య ఈ విమానాలు నడుస్తున్నాయి. జూన్ 2 నుంచి విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాలు ప్రారంభమయ్యాయి. జూన్ 12 నుంచి విశాఖ-భువనేశ్వర్ విమాన సర్వీసు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం-అబుదాబి అంతర్జాతీయ విమాన సర్వీసు జూన్ 13 నుంచి ప్రారంభమైంది. ఇండిగో సంస్థ వారానికి నాలుగు రోజులు ఈ విమాన సర్వీస్ సేవలను అందిస్తుంది. ఇలా చాలా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa