ఆసియా కప్ 2025లో భాగంగా జరగనున్న కీలకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు, క్రికెట్ వ్యూహాల కన్నా షేక్ హ్యాండ్ వివాదమే ప్రధానంగా మారింది. గత మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం కాగా, ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఈ వివాదాన్ని అజారుద్దీన్ తేలికగా కొట్టిపారేశారు. షేక్ హ్యాండ్ ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని, దీనికి అనవసరంగా ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నాడు. “ఆట ఆడేటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి సాధారణం. ఇందులో సమస్య ఏముందో నాకు అర్థం కావడం లేదు” అని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా, నిరసనగా ఆడాలనుకుంటే అసలు ఆడకపోవడమే మంచిదని, ఒకసారి ఆడాలని నిర్ణయించుకున్నాక పూర్తిస్థాయిలో ఆడాలని ఆయన హితవు పలికాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa