ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసిన ట్రంప్,,,,కొత్త దరఖాస్తుదారులకేనని యంత్రాంగం స్పష్టత

national |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 07:06 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం యావత్తు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. గందరగోళానికి దారితీయడంతో శ్వేతసౌధం స్పష్టతనిస్తూ.. కేవలం కొత్త దరఖాస్తులకు మాత్రమే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పటికే హెచ్‌1బీ వీసా ఉన్నవారికి ఇది వర్తించదని పేర్కొంది. తాజాగా, ఈ అంశంపై భారత మాజీ సీనియర్ దౌత్యవేత్త మహేష్ సచ్‌దేవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంపును తొందరపాటు చర్యగా అభివర్ణించారు. పాక్షిక మార్పులు ఉన్నప్పటికీ భారతీయ నిపుణుల స్వేచ్ఛా ప్రవాహానికి ఆటంకం కలిగిస్తోందని విమర్శించారు.


‘‘ఆకస్మికంగా పెంచి, దాదాపు 24 గంటల్లోపే అమలుచేస్తామని నోటీసు ఇచ్చి, ఇప్పుడు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విషయంలో అమెరికా తీరు టూత్ పేస్ట్‌ను తిరిగి ట్యూబ్‌లోకి పంపుతున్నట్టు ఉంది’’ అని దుయ్యబట్టారు. హెచ్-1బీ వీసాలపై ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు ట్రంప్ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ఆయన అన్నారు.


‘అమెరికా కంపెనీల యాజమాన్యాలు దీనిపై ట్రంప్ ప్రభుత్వానికి గట్టి నిరసన తెలియజేశాయి.. దీంతో ట్రంప్ యంత్రాంగం కేవలం కొత్త పిటిషనర్లకు మాత్రమే ఫీజు పెంపు వర్తిస్తుందని ప్రకటించింది.. అందువల్ల దీనికి ఓ గరిష్ఠ పరిమితి ఏర్పడినట్టు కనిపిస్తోంది’ అని ఆయన చెప్పారు. ‘అమెరికన్ కంపెనీల్లో స్థానికులను కాదని విదేశీ నిపుణులను నియమించుకోవడం వల్ల ఐటీ రంగంలో నిరుద్యోగం పెరుగుతుందనే వాదన పూర్తిగా నిజం కాదు... అమెరికా సాధారణ జనాభా నిరుద్యోగంతో పోల్చితే ఐటీ రంగంలో నిరుద్యోగం ఉన్నది వాస్తమే కానీ, నైపుణ్యానికే అధిక ప్రాధాన్యత ఉంటుంది’ అని పేర్కొన్నారు.


‘‘ఐటీ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పాత పద్ధతులు, నైపుణ్యాలు లేనివారికి అవకాశం లేకుండా పోతోంది.. దీని వల్ల నిరుద్యోగం పెరుగుతోంది.. తమను తాము కొత్తగా తీర్చిదిద్దుకుని, కొత్త జ్ఞానం సంపాదించుకోవాలి. ’’ అని సచిదేవ్ సూచించారు. అమెరికా కంపెనీలు సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అవసరమైన స్వేచ్ఛ కల్పించడంపై దృష్టి సారించాయనని అన్నారు.


‘‘సంస్థలు తమ సాంకేతిక లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురు చూడాలనుకోవు. అవసరమైతే విదేశీ నిపుణులను తీసుకుంటాయి. ఇది ఒక రకంగా రెండు వైపులా ఒత్తిడిలా ఉంటుంది.. లేకుంటే స్థానికులను శిక్షణ ఇచ్చి కొత్త నైపుణ్యాలు నేర్చుకునే వరకు వేచి చూడాలి లేదా నైపుణ్యాలు ఎక్కడ లభ్యమవుతాయో అక్కడి నుంచే తీసుకురావాలి’’ అని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa