పాకిస్థాన్తో జరుగుతున్న ఆసియాకప్ 2025 సూపర్-4 మ్యాచ్లో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ .. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఒమన్తో మ్యాచ్తో పోలిస్తే.. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్రూప్ స్టేజ్లో పాకిస్థాన్ తో తలపడ్డప్పుడు ఉన్న ప్లేయింగ్ లెవెన్నే కొనసాగించింది. హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ స్థానాల్లో వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పాకిస్థాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది.
ఆసియాకప్లో పాక్తో లీగ్ స్టేజ్ మ్యాచ్లో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లోనూ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ గెలిచిన వెంటనే అతడు.. నేరుగా వ్యాఖ్యాత రవిశాస్త్రి వద్దకు వెళ్లిపోయాడు. ఆపై మాట్లాడి నేరుగా భారత జట్టు వైపుకు నడిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా సైతం షేక్ హ్యాండ్ కోసం చూడలేదు. తాము టాస్ గెలిచినా.. తొలుత బౌలింగ్ చేసేవాళ్లమని అతడు చెప్పుకొచ్చాడు.
కాగా పాకిస్థాన్ వద్దని డిమాండ్ చేసినా.. ఐసీసీ మాత్రం పట్టించుకోలేదు. ఈ మ్యాచ్కు సైతం ఆండీ పైక్రాఫ్ట్నే రిఫరీగా కొనసాగించింది. ఇద్దరు సారథులతో పాటు.. అతడే టాస్కు రావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ఫైనల్ అవకాశాలు మెరుగవుతాయి. ఓడిన జట్టుకు సంక్లిష్టం అవుతాయి. దీంతో ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకూ కీలకమే
.తుది జట్లు..
భారత్: అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ ఆయూబ్, ఫకర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ హారిస్, ఫహీమ్ అష్రాప్, షాహీన్ అఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa