ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్ళు మసకమసకగా కనిపిస్తున్నాయా,,,అయితే ఇలా చేయండి

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 10:07 PM

కళ్ళు సరిగ్గా పనిచేస్తేనే మనం ఈ లోకాన్ని చక్కగా చూడగలుగుతాం. లేదంటే మసకమసకగా కనిపిస్తుంది. దీంతో రోజువారీ పనులు కష్టంగా మారతాయి. అద్దాలు లేకుండా నడవడం, చదవడం, వంట చేయడం వంటి పనులు చాలా కష్టంగా ఉంటాయి. ఇలాంటి సమస్యల్ని దూరం చేసి నేచురల్‌గానే దృష్టి సమస్యల్ని తగ్గించి కంటిచూపు మెరుగ్గా ఉండేలా చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. మూలికలతోనే మనం దృష్టి సమస్యల్ని తగ్గించి సరిగ్గా చూడగలుగుతాం. దానికోసం ఏ మూలికల్ని ఎలా వాడాలో తెలుసుకోండి. అయితే, ఈ టిప్స్ ఫాలో అయ్యే ముందు ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం మరువొద్దు.


త్రిఫల వాటర్


​త్రిఫల అనేది ఉసిరి, హరితకి, బిబితకి వంటి ముఖ్య మూలికలతో తయారుచేస్తారు. ఇది కంటి చూపుని మెరుగ్గా చేస్తుంది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఉంటుంది. దీని వల్ల కళ్ళలో అలసట తగ్గి దృష్టి మెరుగ్గా మారుతుంది. ​


దీనికోసంఓ టీస్పూన్‌ పరిమాణంలోని త్రిఫల పొడిని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే వడకట్టండి. ఆ నీటితో కళ్ళని నిదానంగా పై నుంచి కడగండి. ఈ నీటిని తాగినా బాడీ డీటాక్సీ ఫై అయి కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.


బ్రాహ్మి, ఉసిరి జ్యూస్


ఆయుర్వేదం ప్రకారం బ్రాహ్మి మంచి బ్రెయిన్ టానిక్ అని చెప్పొచ్చు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. అంతేకాకుండా, బ్రెయిన్ ఫంక్షన్‌ని పెంచుతాయి. నరాలని బలంగా చేసి ఐసైట్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. ​


దీనికోసం1 టీస్పూన్ బ్రాహ్మి జ్యూస్‌ని 2 టేబుల్ స్పూన్ల ఉసిరి రసంతో కలపాలి. దీనిని ఉదయాన్నే పరగడపున తాగాలి. మీకు తాజా పదార్థాలు దొరకకపోతే బ్రాహ్మి క్యాప్సూల్స్, ఉసిరి జ్యూస్‌ని విడివిడిగా తీసుకోవచ్చు.


సోంపు, బాదం టానిక్


సోంపు, బాదం రెండు కూడా ముఖ్య పోషకాలతో ఉంటాయి. వీటి వల్ల కంటి ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బాదంలో విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే దృష్టి సమస్యలు తగ్గుతాయి. ​


ఎలా వాడాలి?* 5, 6 బాదం, 1 టీస్పూన్ సోంపుని రాత్రంతా నానబెట్టండి. * వీటిని గోరువెచ్చని పాలతో కలిపి మిక్సీ పట్టండి. * రోజు రాత్రి పడుకునే ముందు తాగండి. * రెగ్యులర్‌గా తాగితే దృష్టి సమస్యలు తగ్గుతాయి.


అలోవెరా, తేనె ప్యాక్


అలోవెరాలో సూతింగ్, కూలింగ్ గుణాలు ఉన్నాయి. ఇందులో తేనె కలిపితే ఓ అద్భుతమైన పదార్థం తయారైనట్లే. దీనిని మనం రాయడం వల్ల ఎక్కువగా టీవీలు, గ్యాడ్జెట్స్ చూడడం వల్ల వచ్చే కళ్ల చికాకు డ్రైనెస్ తగ్గుతుంది. ​


ఏం చేయాలి* ముందుగా ఓ బౌల్‌లో తాజా అలోవెరా జెల్ తీసుకోండి. అందులోనే ఆర్గానిక్ తేనె 2, 3 చుక్కలు వేసి కలపండి. * దీనిని బాగా మిక్స్ చేసి కళ్ల చుట్టూ రాయండి. * దానిని అలానే 10 నుంచి 15 నిమిషాలు ఉంచండి. * చల్లని నీటితో కడగండి.


నెయ్యితో మసాజ్


ఆయుర్వేదం ప్రకారం స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపుకి చాలా మంచిది. ఈ ఆవునెయ్యిని కొద్దిగా గోరువెచ్చగా చేసి కాస్తా వేడిగా ఉన్నప్పడు అంటే గోరువెచ్చగా కంటే తక్కువగా వేడి ఉండాలి. ఎక్కువగా వేడి ఉంటే కళ్ళకి సమస్యలొస్తాయి. కాబట్టి, తక్కువ వేడిగా ఉన్నప్పుడు కళ్ళపై వేసి మెల్లిగా మసాజ్ చేయాలి. దీని వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ పెరుగుతుంది. ఐ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. ​ దీనికోసం* రాత్రి నిద్రపోయే ముందు మసాజ్ చేయాలి. * మీరు టీస్పూన్ నెయ్యిని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు కూడా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa