ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద ప్రజలు భారతదేశ వృద్ధి కథలో కీలకపాత్ర పోషిస్తున్నారు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 02:54 PM

కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా చేసిన కృషితో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారని ప్రధాని చెప్పారు. నియో-మిడికల్ క్లాస్‌గా ఉండే ఈ 25 కోట్ల మంది ప్రజలు భారతదేశ వృద్ధి కథలో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియని, దేశ అవసరాలు కాలాన్ని బట్టి మారుతుంటాయని, దేశ ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ కలలను దృష్టిలో ఉంచుకుని తాజా జీఎస్టీ సంస్కరణలు తెచ్చామని చెప్పారు. రేపట్నించి కేవలం 5, 18 శాతం శ్లాబులు మాత్రమే అమల్లోకి వస్తాయని, దీంతో ప్రతి వస్తువు ధర తగ్గుతుందని చెప్పారు. ఆహార పదార్థాలు, ఔషధాలు, సబ్బులు, బ్రష్, పేస్ట్, హెల్త్ అండ్ ఇన్స్యూరెన్స్, ఇంకా పలు వస్తువులు సేవలు జీరో టాక్స్ లేదా 5 శాతం పన్నుకే పరిమితమవుతాయని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa