ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 05:33 PM

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈరోజు (బుధవారం) ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఎండోమెంట్ కమిషనర్ సిహెచ్ రామచంద్ర మోహన్, మినిస్టర్ పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్, బోర్ర గాంధీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులను, మీడియా మిత్రులను కలిసి వైస్ ప్రెసిడెంట్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచరం పొందారు. తరువాత అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఆలయ ఈవో అందజేశారు.కాగా.. విజయవాడలో పర్యటన నిమిత్తం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి దుర్గమ్మ సన్నిధికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa