ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. అక్వా డెవలప్మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో రెండు బిల్లులు.. అక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే ఆక్వా, సహకార శాఖలకు సంబంధించి చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో సదరు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. మరోవైపు మంగళవారం అసెంబ్లీలో మూడు బిల్లులతోపాటు ఒక తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించిన విషయం విదితమే. ఎస్సీ వర్గీకరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, భారతీయ నాగరిక్ సురక్షా సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి సభలో ప్రవేశపెట్టారు. వీటికి ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, ఎంఎస్ రాజు, బి.రామాంజనేయులు మద్దతు తెలిపారు. ఈ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక స్థానిక సంస్థలకు నాలా ఫీజు ఇచ్చే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. దీనిని ఎమ్మెల్యే పార్థసారథి మద్దతు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa