తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు వీడియో సందేశం ద్వారా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేశారు. దసరా సెలవులు కావడంతో తిరుపతికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీవారి దర్శనం, వాహన సేవలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. అలిపిరి నుంచి తిరుమల వరకు భద్రతా చర్యలు పటిష్టం చేశామని, చిన్నారుల రక్షణ కోసం చైల్డ్ ట్యాగింగ్ సిస్టం అమలు చేస్తున్నామని తెలిపారు. భక్తులు తక్కువ లగేజీతో తిరుమలకు రావాలని, క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని, వాహన సేవ సమయంలో చిల్లర నాణేలు విసరరాదని సూచించారు. వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని, ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ లేదా టీటీడీ బస్సులను వినియోగించాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa