ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రవిచంద్రన్ అశ్విన్

sports |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 07:54 PM

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో అడుగుపెట్టనున్నాడు. నివేదికల ప్రకారం, సిడ్నీ థండర్ ఫ్రాంచైజీతో అశ్విన్ దాదాపుగా ఒప్పందం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం పూర్తయితే, బీబీఎల్‌లో ఆడిన తొలి ప్రధాన భారత పురుషుల క్రికెటర్‌గా అశ్విన్ రికార్డులకెక్కుతాడు.భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి, ఐపీఎల్ సహా దేశవాళీ టోర్నీల నుంచి ఈ ఏడాది ఆరంభంలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం, భారత క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన ఆటగాళ్లు మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అర్హులు. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల అశ్విన్ విదేశీ ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. యూఏఈలో జరిగే ఐఎల్‌టీ20 టోర్నీలో తన బాధ్యతలు ముగిసిన వెంటనే, అతను సిడ్నీ థండర్ జట్టుతో చేరతాడని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa