భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తన విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో రాధాకృష్ణన్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa