ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు అలర్ట్.. 2026 సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్

national |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:48 PM

వచ్చే ఏడాది జరగబోయే బోర్డు ఎగ్జామ్స్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) బుధవారం (సెప్టెంబరు 24న) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి జులై 15 మధ్య 10వ, 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి, 12వ తరగతి ప్రధాన పరీక్షలు, ప్లస్ టు స్పోర్ట్స్ విద్యార్థుల పరీక్షలు, పదో తరగతి సెకెండ్ బోర్డ్ పరీక్షలు, ప్లస్ టు సప్లిమెంటరీ పరీక్షలు ఇందులో ఉన్నాయి. సీబీఎస్‌ఈ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌తో పాటు 26 దేశాలకు చెందిన దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు.. 264 సబ్జెక్టుల్లో పరీక్షలు రాయనున్నారు.


రాత పరీక్షలు, ప్రాక్టికల్స్, యాక్టివిటీలు, మూల్యాంకం, ఫలితాల తర్వాత ప్రక్రియలు అన్నీ నిర్వహిస్తామని, ఇవన్నీ ఫలితాలను సరైన సమయానికి ప్రకటించడానికి సహాయపడతాయని బోర్డు పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం.. ఆయా సబ్జెక్ట్‌ల రాత పరీక్షలు పూర్తియిన 10 రోజుల తర్వాత పేపర్ వేల్యూషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇది 12 రోజుల్లో పూర్తవుతుంది. ఉదాహరణకు ప్లస్ టు ఫిజిక్స్ పరీక్ష ఫిబ్రవరి 20న జరిగితే.. పేపర్లు దిద్దడం మార్చి 3న ప్రారంభమైన మార్చి 15తో ముగుస్తుంది. అయితే, ఇది తాత్కాలిక షెడ్యూల్ అని, బోర్డు పరిధిలోని అన్ని పాఠశాలలు విద్యార్థుల డేటాను సమర్పించిన తర్వాత ఖచ్చితమైన తేదీలను వెల్లడించనున్నట్టు స్పష్టం చేసింది.


కాగా, 10వ తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాకుంది. ఫిబ్రవరిలో నిర్వహించే తొలి విడత పరీక్షలు మాత్రం తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మేలో నిర్వహించే రెండో విడతను ఆప్షనల్‌గా పేర్కొంది. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను ఈ ఏడాది జులైలో సీబీఎస్‌ఈ ఆమోదించింది. విద్యార్థుల్లో బోర్డు పరీక్షల విషయంలో ఒత్తిడి తగ్గించేలా జాతీయ విద్యా విధానం పలు సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి, మే నెలల్లో రెండు దశల్లో పది పరీక్షలు నిర్వహించనుంది.


తొలి దశ ఫలితాలు ఏప్రిల్‌లో, రెండో దశ ఫలితాలను జూన్‌లో వెల్లడిస్తారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు పరీక్షలంటే భయం పోతుందని, మార్కులు మెరుగుపరచుకునే వీలు ఉంటుందని అభిప్రాయపడింది. కానీ, అంతర్గత మూల్యాంకం మాత్రం ఏడాదికి ఒకసారి ఉంటుంది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఈ విధానాన్ని సీబీఎస్‌ఈ అమలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో పరీక్షలను రద్దుచేయడంతో సిలబస్ భారం తగ్గించడానికి ఇలా చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa