మాజీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఓ కొత్త నాటకానికి తెరలేపారని, అందులో సీఐ శంకరయ్య ఓ పాత్రధారిగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీసులు పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు.రాబోయే రోజుల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని జగన్ ఆశ చూపడం వల్లే, శంకరయ్య ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి బాధ్యులైన వారు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య విధుల్లో ఉన్నారని భూమిరెడ్డి గుర్తుచేశారు. ఆ రోజున నిందితులు సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తుంటే, వారికి శంకరయ్య పూర్తిగా సహకరించారని, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అప్పట్లో ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు పలు సెటిల్మెంట్లు చేసుకున్న తర్వాతే, ఆయన నిందితులకు అనుకూలంగా మారారని విమర్శించారు.ఇప్పుడు మళ్లీ హైకోర్టును ప్రభావితం చేసే ఉద్దేశంతో, వివేకా హత్య కేసులోని నిందితులకు మేలు చేకూర్చడానికే శంకరయ్య ఈ కొత్త డ్రామా ఆడుతున్నారని రాంగోపాల్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి నోటీసులు పంపడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa