ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదాస్పదంగా మారిన సూర్యకుమార్ యాదవ్

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 05:55 PM

ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన గెలుపు తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేయడంతో ఐసీసీ విచారణకు ఆదేశించింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇవి కొనసాగుతుండగానే ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాడు. అంతేకాకుండా, పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి భారత జట్టు నిరాకరించింది.సూర్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను పీసీబీ తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యాఖ్యలు 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్'కు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఐసీసీకి రెండు వేర్వేరు ఫిర్యాదులు చేసింది. ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఐసీసీ, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్‌ను నియమించింది. విచారణ చేపట్టిన రిచర్డ్సన్.. సూర్యకుమార్ వ్యాఖ్యలు క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa