ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిచ్చురేపిన ఫ్లెక్సీ వివాదం, రెండు వర్గాల మధ్య ఘర్షణ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 05:59 PM

కర్ణాటకలోని దావణగెరెలో ఒక ఫ్లెక్సీ బ్యానర్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం రాళ్ల దాడికి కారణమైంది. ఈ ఘటనలో ఒక బాలిక గాయపడగా, కొన్ని ఇళ్ల తలుపులు ధ్వంసమయ్యాయి. పోలీసులు సత్వరమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దావణగెరెలోని కార్ల్ మార్క్స్ నగర్‌లో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'ఐ లవ్ మహమ్మద్' అని రాసి ఉన్న ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ బ్యానర్‌ను వెంటనే తొలగించాలని ఒక వర్గం పట్టుబట్టడంతో వివాదం ముదిరింది. కొద్దిసేపటికే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఒక బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న ఆజాద్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ ఈ ఘటనపై స్పందిస్తూ, "బ్యానర్ ఏర్పాటు విషయమై రెండు వర్గాలు గుమికూడాయి. పోలీసులు ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంది. వివాదాస్పద బ్యానర్‌ను కూడా తొలగించాం" అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa