ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో నూతన భవనం, నేడు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 06:02 PM

అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో రూ.3.55 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా, రాష్ట్రానికి శాశ్వత, పూర్తిస్థాయి అసెంబ్లీ భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని నేతలు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, "ఈ నూతన భవనాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. దీని మొదటి అంతస్తును విప్‌లకు కేటాయించాం. త్వరలోనే ఇక్కడ మీడియా పాయింట్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మంత్రి నారాయణ ఎంతో కృషి చేశారు" అని ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa