మరో మ్యాచ్ మిగిలిఉండగానే ఆసియా కప్ 2025 (Asia Cup 2025 Final) ఫైనలిస్ట్లు ఎవరో తేలిపోయింది. సెప్టెంబర్ 28న భారత్ - పాకిస్థాన్ టైటిల్ కోసం తలపడతాయి.ఇప్పటికే ఈ ఎడిషన్లో రెండుసార్లు పాక్పై టీమ్ఇండియా విజయం సాధించింది. హ్యాట్రిక్పై కన్నేసిన భారత్ను అడ్డుకోవడం తమ జట్టుకు చాలా కష్టమని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. అయితే, ఒకే ఒక్క పని చేస్తేనే టీమ్ఇండియాపై ఒత్తిడి తెచ్చేందుకు వీలవుతుందని తెలిపాడు. పాక్ ప్లేయర్లు తమ మైండ్ సెట్ను త్వరగా మార్చుకోవాలని పేర్కొన్నాడు.
'భారత్తో మ్యాచ్ అంటే ఒత్తిడికి గురయ్యే మైండ్సెట్ నుంచి పాక్ ఆటగాళ్లు బయటకు రావాలి. బంగ్లాపై ఎలా ఆడారో అలాగే భారత్ను ఎదుర్కోవాలి. మొత్తం 20 ఓవర్లూ బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. పది వికెట్లు తీసేందుకు ప్రయత్నించాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలు గుర్తు పెట్టుకోండి. అభిషేక్ శర్మను రెండు లేదా మూడు ఓవర్లలోనే ఔట్ చేస్తేనే వారిని ఇబ్బంది పెట్టొచ్చు. వారికి ఇప్పటివరకు వచ్చిన ఆరంభాలన్నీ అతడు తీసుకొచ్చినవే. అభిషేక్ను త్వరగా ఔట్ చేయాలి. అలా కుదరకపోతే మాత్రం మరోసారి ఇబ్బందులు తప్పవు. అభిషేక్ కూడా బంతిని మిస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అతడిపై కాస్త ఎదురుదాడి చేయాలి. అప్పుడే భారత్ మిగతా బ్యాటర్లు కాస్త ఆచితూచి ఆడేందుకు ప్రయత్నిస్తారు. పరుగుల కోసం కష్టపడతారు. అయితే, భారత్ తమ అత్యుత్తమ గేమ్ను తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. అక్కడ ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. పాక్పై టాప్ క్లాస్ ఆటను ఆడాలని భారత్కు చెబుతాడు. చెత్త జట్టుతో దిగినా, నాసిరకంగా ఆడినా పాక్ ఫైనల్కు చేరుకుంది. ఇక్కడ మాత్రం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నా'' అని వ్యాఖ్యానించాడు.ఆసియా కప్లో నాలుగు మ్యాచుల్లో డకౌట్ అయిన సైయామ్ ఆయుబ్పై పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బౌలింగ్లో రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్లో విఫలం కావడంపై విమర్శలు గుప్పించాడు. ''ఆసియా కప్లో రెండోసారి డకౌట్ అయినప్పుడే నేను ఆయుబ్ను బెంచ్కే పరిమితం చేయాలని చెప్పా. అతడి స్థాయి ఆట ఇది కాదు. చాలా టాలెంట్ కలిగిన ప్లేయర్. ఒక్కోసారి మనం అనుకున్నవి కానప్పుడు విరామం తీసుకోవాలి. మైదానంలోకి వచ్చాక అతడి బాడీ లాంగ్వేజ్ కూడా పేలవంగా ఉంది. యువకుడైన అతడికి ఇంకా చాలా కెరీర్ ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. కేవలం బౌలర్గానే ఆయుబ్ జట్టులో ఉన్నాడు. ఈ విషయంపై మేనేజ్మెంట్ దృష్టి పెట్టాలి'' అని వకార్ వ్యాఖ్యానించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa