చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని నారిగాని పల్లె గ్రామంలో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆమెను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa