IND vs PAK - క్రికెట్ అభిమానులకు మళ్లీ మజా ఖాయం!
ఆసియా కప్ టోర్నమెంట్లో భారత్ పాక్ను మూడు సార్లు ఓడించి, హ్యాట్రిక్ విజయాలతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లోనూ పాకిస్థాన్పై గెలుపొంది ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 ఫార్మాట్లో తలపడనున్నాయి. 2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనుండగా, భారత్ మరియు శ్రీలంక ఈ టోర్నమెంట్కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. మొత్తం 20 జట్లు ఈ మెగా ఈవెంట్లో పోటీపడతాయి. భారత్లో కనీసం ఐదు వేదికలపై, శ్రీలంకలో రెండు వేదికలపై మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ను అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహించే అవకాశం ఉంది. ఐసీసీ షెడ్యూల్ను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, విశ్లేషకుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ మధ్యాహ్నం 3 గంటలకు మొహాలీలో, అదే రోజున రాత్రి 7:30కి భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నట్టు భావిస్తున్నారు.ఇప్పటికే భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ సహా 15 జట్లు టోర్నీలోకి అర్హత సాధించాయి. అందులో ఇటలీ తొలిసారి టీ20 వరల్డ్ కప్కి అర్హత పొందడం విశేషం. మిగిలిన ఐదు స్థానాలు క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా నిర్ణయించనున్నారు — వాటిలో రెండు ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్ నుంచి, మిగిలిన మూడు ఆసియా మరియు ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫయర్ల నుంచి ఎంపికవుతాయి.ఈ టోర్నీ ఫార్మాట్ గత 2024 టీ20 వరల్డ్ కప్ లాగే ఉండనుంది. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడతాయి, ప్రతి గ్రూపులో ఐదేసి జట్లు ఉంటాయి. గ్రూప్ దశలో టాప్ 2 జట్లు సూపర్ 8కు అర్హత పొందతాయి. అనంతరం రెండు సూపర్ 8 గ్రూపులు రూపొందించి, వాటి నుంచి టాప్ 2 జట్లు సెమీఫైనల్స్కి, తర్వాత ఫైనల్కు వెళతాయి. భారత్ ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. 2024లో బార్బడోస్లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ ట్రోఫీ గెలుచుకుంది. ఆ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్లు నిర్వహించబడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa