ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎంకే ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున

national |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 05:43 PM

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సీనియర్ నేత చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. అధికార డీఎంకే ‘దుష్ట ప్రభుత్వం’పై నేపాల్ యువతలా తిరుగుబాటు చేయాలంటూ టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున 'ఎక్స్'లో పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన 48 గంటల్లోపే ఈ పోస్ట్ రావడం గమనార్హం. వివాదం ముదరడంతో ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించారు. "యువత నేతృత్వంలోని విప్లవమే దీనికి ఏకైక పరిష్కారం. శ్రీలంక, నేపాల్‌లలో 'జెన్ జీ' యువత అక్కడి ప్రభుత్వాలపై తిరగబడింది. ఇక్కడ కూడా యువతే విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఆ విప్లవమే ప్రభుత్వ మార్పునకు కారణమవుతుంది. దుష్ట పాలకుడి కింద చట్టాలు కూడా దుష్టంగానే మారతాయి" అని అధవ్ అర్జున తన పోస్టులో పేర్కొన్నారు. రోడ్డుపై నడిచినందుకే పోలీసులు ప్రజలపై దాడులు చేస్తున్నారని, సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పినందుకు అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa