ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి పౌర హక్కులను సైతం కాలరాస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 05:52 PM

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను, సోషల్ మీడియా కార్యకర్తలను, ప్రజలను అక్రమంగా అరెస్టు చేస్తూ... కూటమి ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. పదే, పదే కోర్టులు అక్షింతలు వేస్తున్నా ప్రభుత్వం, పోలీసులు తమ తీరు మార్చుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని.. ప్రజా కోర్టులో తగిన శిక్ష ఖాయమని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa