శాసనమండలి సమావేశాల ద్వారా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాగళాన్ని వినిపించామని, ప్రజాసమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా నిలదీశామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్ స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది రోజుల శాసనసభ, మండలి సమావేశాల్లో ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని, వారి అసమర్థ పాలనపై ప్రజల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ప్రతిపక్షంగా మండలిలో వ్యక్తీకరించామని పేర్కొన్నారు. రైతుల కష్టాలు, యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, స్టీల్ప్లాంట్ పరిరక్షణ, హామీల అమలో వైఫల్యం, అప్పుల కుప్పగా మారుస్తున్న వైనం తదితర అంశాలపై ప్రతిపక్షంగా మేం సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖ్యమంత్రితో సహా మంత్రుల నీళ్ళు నమిలారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఏకంగా అబద్దాలతో సభను పక్కదోవ పట్టించేందుకు విఫలయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజాగొంతుకగా వైయస్ఆర్సీపీ చట్టసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించిందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa