రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమర్థ, అసమర్థ పాలన మధ్య ఉన్న తేడాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో చంద్రబాబు పలు కీలక అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వం ‘ట్రూ అప్’ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపిందని, కానీ తమ కూటమి ప్రభుత్వం ‘ట్రూ డౌన్’ పేరుతో ఛార్జీలను తగ్గిస్తోందని చంద్రబాబు తెలిపారు. పీక్ అవర్స్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయకుండా, స్వాపింగ్ విధానాన్ని అనుసరించడం వల్లే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa