ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో భాగస్వామ్య సదస్సు.. వాణిజ్య ప్రతినిధులకు సీఎం ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 08:02 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే "భాగస్వామ్య సదస్సు"కు వాణిజ్య ప్రతినిధులను ఆహ్వానించారు. పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలను పంచుకోవాలని ఆయన కోరారు. ఈజీ ఆఫ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, స్వర్ణాంధ్రప్రదేశ్-2047 లక్ష్యంగా సమగ్రాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. అమరావతిలో 2026 జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభం కానుందని, ఏపీ 15 శాతం ఆర్థికాభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు.  ఏపీలో రెన్యువల్ ఎనర్జీకి అద్భుతమైన అవకాశాలున్నాయని, ప్రపంచస్థాయి ఓడరేవులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa