ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీ మహిళల వన్డే 2025 ఫుల్ షెడ్యూల్ ఇదే

sports |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 09:46 PM

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025కు అంతా సిద్ధమైంది. భారత్, శ్రీలంక వేదికగా ఈ వన్డే వరల్డ్‌కప్ సాగనుంది. అయితే, అందరి దృష్టి ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ మీదే. ఇరు దేశాల పరిస్థితుల దృష్ట్యా ఐసీసీ ఈ మ్యాచ్ కోసం తటస్థ వేదికను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, పాకిస్తాన్ మొత్తం ఎనిమిది జట్లు ఈ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నాయి. భారత్, శ్రీలంకలోని ఐదు సిటీలు ఈ మ్యాచ్‌లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్ వేదికగా ముంబై, వైజాగ్, ఇండోర్, గౌహతి.. శ్రీలంకలోని కొలంబోలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.


గువాహటి వేదికగా సెప్టెంబర్ 30న భారత్ - శ్రీలంక మ్యాచ్‌తో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అక్టోబర్ 1న జరగనుంది. భారత్ - పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 5న జరిగే మ్యాచ్‌కు కొలంబో వేదిక అవ్వనుంది. సింగిల్ రౌండ్-రాబిన్ విధానంలో ఈ వరల్డ్‌కప్ జరగనుంది. ఈ వరల్డ్‌కప్‌లో పాల్గొనే ప్రతి జట్టూ మిగతా అన్నీ జట్లతో ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశలో మొత్తం 28 మ్యాచ్‌లు జరగనున్నాయి.


ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌లో అడుగుపెడితే భారత్ వేదికగా కాకుండా శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించేలా ఐసీసీ షెడ్యూల్ తయారు చేసింది. అక్టోబర్ 26తో లీగ్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అక్టోబర్ 29న జరిగే మొదటి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌కి పాకిస్తాన్ అర్హత సాధిస్తే కొలంబోలో, పాకిస్తాన్ అర్హత సాధించకపోతే భారత్‌లో మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 30న జరిగే రెండో సెమీ ఫైనల్స్ నవీ ముంబైలో జరగనుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్స్‌కు పాకిస్తాన్ అర్హత సాధిస్తే కొలంబోలో, పాకిస్థాన్ అర్హత సాధించకపోతే భారత్‌లో మ్యాచ్ జరుగనుంది.


లీగ్ దశలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లు:


భారత్ లీగ్ దశలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 30న గువాహటి వేదికగా శ్రీలంకతో, అక్టోబర్ 5న కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో, అక్టోబర్ 9న వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో, అక్టోబర్ 12న వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో, అక్టోబర్ 23న నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 26న వైజాగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa