ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో అమ్మవారి తెప్పోత్సవంపై ఉత్కంఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 02:26 PM

కృష్ణా నదికి భారీ వరద నేపథ్యంలో అమ్మవారి తెప్పోత్సవంపై ఉత్కంఠ నెలకొంది. తెప్పోత్సవానికి ఎన్ఓసీ ఇవ్వడానికి జలవనరుల శాఖ నిరాకరించింది. 2022, 2023 సంవత్సరాలలో దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. మహా మండపంలో ఉత్సవమూర్తులను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు అధికారులు. గత ఏడాది వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నది ఒడ్డున హంస వాహనంపై పూజా కార్యక్రమం మాత్రమే నిర్వహించారు. మరి ఈ ఏడాది కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో అమ్మవారి తెప్పోత్సవంపై సస్పెన్స్ కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa