ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్వాక్రా పొదుపు నిధులపై ప్రభుత్వం కన్నెయ్యడం దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 05:10 PM

డ్వాక్రా మహిళల పొదుపు నిధులపై కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కన్నేయడం దారుణమని విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... మహిళలకు గత ప్రభుత్వంలో వైయస్ జగన్ ఉచితంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇచ్చిన లబ్ధిని నేడు కూటమి ప్రభుత్వం వడ్డీతో కూడిన రుణంగా ఇస్తామనడం దుర్మార్గం కాదా అని మండిపడ్డారు. మహిళల పొదుపు సొమ్మును పథకాల పేరుతో మళ్ళించి, తమ ఘనతగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా, వడ్డీతో కూడిన విద్యాలక్ష్మి రుణాలను ఇస్తామనడం ఈ ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని అన్నారు. వీటిని పథకాలు అని చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబు సిగ్గపడాలని, ఇవి మహిళలకు చేస్తున్న ఢోకా కాదా అని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa