వెస్టిండీస్తో తొలి టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో పేసర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో కరేబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది.ఆట ప్రారంభమైనప్పటి నుంచే భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా, మహమ్మద్ సిరాజ్ (4/40) తన పదునైన బౌలింగ్తో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశాడు. కీలకమైన టాప్ ఆర్డర్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చి జట్టుకు శుభారంభం అందించాడు. అతనికి జస్ప్రీత్ బుమ్రా (3/42) కూడా తోడవడంతో విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ తీవ్ర ఒత్తిడికి గురైంది.వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధిక స్కోరు కావడం వారి బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది. షాయ్ హోప్ (26), కెప్టెన్ రోస్టన్ చేజ్ (24) కాసేపు క్రీజులో నిలిచినా, భారత బౌలర్ల ధాటికి ఎక్కువసేపు నిలవలేకపోయారు. పేసర్లు విజృంభించిన తర్వాత స్పిన్నర్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. మొత్తం మీద 44.1 ఓవర్లలోనే విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి రోజు ఆటలోనే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు ఆలౌట్ చేసి, టీమిండియా మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది.అనంతరం, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 1 పరుగు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1 బ్యాటింగ్), యశస్వి జైస్వాల్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa