ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వదేశీ ఉత్పత్తులను భారతీయులందరు ప్రోత్సహించాలి

national |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 05:52 PM

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వావలంబన సాధించడం ద్వారానే దేశం ముందుకు సాగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అమెరికా వంటి దేశాలు భారత వస్తువులపై టారిఫ్‌లతో ఒత్తిడి పెంచుతున్న ప్రస్తుత తరుణంలో మన కాళ్లపై మనం నిలబడటమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. గురువారం నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు.ప్రపంచ దేశాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయని, అయితే ఈ పరస్పర ఆధారం మన బలహీనతగా మారకూడదని భగవత్ హితవు పలికారు. "స్వదేశీకి, స్వావలంబనకు ప్రత్యామ్నాయం లేదు. మనం ఆత్మనిర్భర్‌గా మారినప్పుడే మన సంకల్పం ప్రకారం నడుచుకోగలుగుతాం" అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa