ఫుట్బాల్ ప్రపంచాన్ని తన అద్భుతమైన ఆటతీరుతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ, దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. భారత పర్యటన ఖరారైనట్లు నిర్వాహకులు ప్రకటించడంతో దేశంలోని ఫుట్బాల్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన దేశంలోని పలు నగరాలను సందర్శించనున్నారు.అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ "గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025" పేరుతో భారత్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ టూర్లో భాగంగా మెస్సీ మొదట కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. త్వరలోనే నాలుగో నగరాన్ని కూడా ప్రకటిస్తామని ఈవెంట్ మేనేజర్ తెలిపారు. 2011లో అర్జెంటీనా జాతీయ జట్టుతో కలిసి కోల్కతాలో వెనిజులాపై ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన తర్వాత మెస్సీ భారత్కు రావడం ఇదే తొలిసారి.ఈ పర్యటనపై మెస్సీ స్పందిస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "భారత్ చాలా ప్రత్యేకమైన దేశం. 14 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పటి మధుర జ్ఞాపకాలు నాకింకా గుర్తున్నాయి. అప్పటి అభిమానుల స్పందన అద్భుతం. ఇప్పుడు కొత్త తరం అభిమానులను కలుసుకోవడానికి, ఫుట్బాల్పై నాకున్న ఇష్టాన్ని వారితో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని మెస్సీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa