ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 05:59 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రానున్న కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పందిస్తూ, "తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి" అని తెలిపారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa