కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా నిర్వహించే బన్ని జైత్రయాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది దసరా బన్ని యాత్ర ఘనంగా జరిగింది. దేవతామూర్తులను రక్షించుకునేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు.. 7 గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడ్డారు. ఈ సమరాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవరగట్టుకు తరలివచ్చారు. అయితే, ఈ సమరంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. నిన్న అర్ధరాత్రి శ్రీ మాళ మల్లేశ్వరస్వామి కళ్యాణం అనంతరం కొండ మీద ఉన్న ఆలయం నుంచి సింహాల కట్ట మీదకు ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చే సమయంలో రింగులు తొడిగిన కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ సమయంలో తలకు గాయమై ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతి చెందారు. దాదాపు 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి దేవరగట్టులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లో చికిత్స అందించగా సీరియస్గా ఉన్నవారిని ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa